Header Banner

ఆరోపణలు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం! జగన్ రెడ్డికి ఓపెన్ ఛాలెంజ్.. లోకేశ్!

  Mon Jun 02, 2025 20:30        Politics

విశాఖలో ఉర్సా కంపెనీకి భూ కేటాయింపులపై వైసీపీ అధినేత జగన్ చేసిన ఆరోపణలపై రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో స్పందించారు. జగన్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, ఒకవేళ ఆ ఆరోపణలు తప్పని తేలితే రాష్ట్ర యువతకు క్షమాపణ చెప్పాలని లోకేశ్ బహిరంగ సవాల్ విసిరారు. ఆరోపణలు చేయడం, ఆ తర్వాత వాటి నుంచి తప్పించుకోవడం జగన్ రెడ్డికి కొత్తేమీ కాదని ఆయన విమర్శించారు. ఈ మేరకు మంత్రి లోకేశ్ ఓ ప్రకటన చేశారు. "ఉర్సా కంపెనీకి విశాఖపట్నంలో ఎకరం రూపాయికే భూములు కట్టబెట్టారంటూ మీరు (జగన్ రెడ్డి) తీవ్ర ఆరోపణలు చేశారు. నేను స్పష్టంగా మరోసారి చెబుతున్నా.. ఉర్సా కంపెనీకి విశాఖలోని ఐటీ పార్క్ హిల్ - 3 లో ఎకరం కోటి రూపాయల చొప్పున మూడున్నర ఎకరాలు కేటాయించాం. అలాగే, కాపులుప్పాడలో ఎకరా యాభై లక్షల రూపాయల చొప్పున 56.36 ఎకరాలు కేటాయించాం. కేవలం బురదజల్లి ప్యాలెస్‌లో దాక్కోవడం కాదు, మీరు చేసిన ఆరోపణలను నిరూపించండి. ఈ ఛాలెంజ్‌కు మీరు సిద్ధమా జగన్ రెడ్డి గారు?" అని ప్రశ్నించారు. గత ఐదేళ్ల జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రానికి ఒక్క కొత్త కంపెనీని కూడా తీసుకురాలేకపోయారని, పైగా ఉన్న కంపెనీలను ఇతర రాష్ట్రాలకు తరిమేశారని లోకేశ్ ఆరోపించారు. ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకొని తాము పనిచేస్తున్నామని తెలిపారు. పెద్ద ఎత్తున రాష్ట్రానికి పెట్టుబడులు రాబడుతున్నామని, నూతన కంపెనీలు రావడం, యువతకు ఉద్యోగ అవకాశాలు లభించడం చూసి జగన్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. "ఈనో వాడండి, కాస్త రిలీఫ్ వస్తుంది" అంటూ లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తమ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందని, ఎవరైనా ఆధారాలతో వస్తే చర్చకు సిద్ధమని ఆయన పునరుద్ఘాటించారు.

 

ఇది కూడా చదవండి: టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు కీలక బాధ్యతలు అప్పగించిన కేంద్రం! ఎన్డీఏ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

 హోంమంత్రి సంచలనం వ్యాఖ్యలు! కూటమి ప్రభుత్వం వచ్చినాకే...

 

రేషన్ కార్డుదారులకు శుభవార్త..! మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన!

 

నెల్లూరు జిల్లాలో టీడీపీ నేత దారుణ హత్య ..! మృతదేహాన్ని ముక్కలు చేసి బోరు బావిలో వేసి!

 

ఏపీ మీదుగా బుల్లెట్ ట్రైన్! ఈ రూట్‌లోనే, భూసేకరణకు రెడీ!

 

 హోంమంత్రి సంచలనం వ్యాఖ్యలు! కూటమి ప్రభుత్వం వచ్చినాకే...

 

 అమెరికాపై టెర్రర్ అటాక్! షాపింగ్ మాల్ లో..ఫైర్ బాంబులతో దాడి, పలువురికి గాయాలు!

 

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పండగే.. జూన్ 9 వరకు ఛాన్స్! ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!

 

తల్లికి వందనంపై బిగ్ అప్డేట్ .. ఈ 2 పనులు చేశారా..! 5 రోజులే ఉందంట!

 

రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్‌ కొత్త టైమింగ్స్‌, తేదీలు ఇవే..!

 

ఏపీ ప్రభుత్వం మరో అలర్ట్..! వీళ్లు ఇళ్లలో నుంచి అస్సలు రావొద్దు..!

 

ఏపీలో మళ్లీ మొదలైన రేషన్ షాపులు! క్యూ కట్టిన జనం!

 

ఏపీ ప్రజలకు ప్రభుత్వం బంపరాఫర్..! ఆ ప్లాట్లు వేలంలో దక్కించుకునే మంచి ఛాన్స్!

 

 రేషన్‌ వద్దనుకుంటే డీబీటీ పద్ధతిలో డబ్బులు! సీఎం చంద్రబాబు!

 

నేడు (2/6) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీలో టీచర్ ఉద్యోగాలకు తీవ్ర పోటీ! ఒక్కో పోస్టుకు సగటున 35 మంది!

 

ఏపీలో వారందరికీ గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికీ రూ.15 వేలు అకౌంట్లలోకి డబ్బులు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #NaraLokesh #AndhraPradesh #Appolitics #Jagan #APNews #LandAllotmentAllegation #Comments #LokeshChallenge